బైక్ నడుపుతూ వ్యక్తి మృత్యువాత

Mar 29,2024 15:22 #Bapatla District

ప్రజాశక్తి-అద్దంకి : ద్విచక్ర వాహనం నడుపుతూ ఒక్కసారిగా కుప్పకూలిన ఘటనలో వ్యక్తి అక్కడకక్కడే మృత్యువాత పడిన ఘటన శుక్రవారం జరిగింది. వివరాలలోకి వెళితే ధేనువకొండ (బలరామకృష్ణ పురం) గ్రామానికి చెందిన గ్రామానికి చెందిన పాలపర్తి ఏసోబు (45) ప్రైవేటు విద్యుత్తు ఎలక్ట్రికల్ పనులు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో దేనుగుకొండ గ్రామానికి వెళ్తున్న సమయంలో వేణుగోపాలపురం గ్రామం దగ్గర ద్విచక్ర వాహనంపై నుండి ఒక్కసారిగా ఏసోబు కుప్ప కూలినాడు. స్థానికులు వెంటనే మంచినీరు ఇచ్చి సపరిచేసినప్పటికీ ఫలితం దక్కలేదు. స్థానికులు వెంటనే మృతుని బంధువులకు సమాచారం అందించారు. మృతుని భార్య అనారోగ్యంతో గత ఏడు నెలల క్రిందట మృతి చెందింది. మృతునికి కుమారుడు ఉన్నారు.

➡️