రోగులకు మెరుగైన వైద్యం అందిస్తాం : డయేరియా రోగులను పరామర్శించిన ఆర్జేడీ

Mar 27,2024 23:31 ##RJD #Medical

ప్రజాశక్తి – కర్లపాలెం
రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు వైద్య ఆరోగ్య శాఖ కృషి చేస్తోందని వైద్య శాఖ రీజనల్ డైరెక్టర్ డాక్టర్ శోభారాణి అన్నారు. మండలంలోని చింతాయపాలెం, యాజలి గ్రామాల్లో గత కొద్ది రోజులుగా వాంతులు, విరోచనాలు, డెంగ్యూ జ్వరాలతో బాధపడుతూ ప్రైవేట్, ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న రోగులను ఆమె బుధవారం పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితులపై రోగులతో మాట్లాడారు. ఈపాటికే అనారోగ్య బారిన పడిన గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహించి రోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేయడంతో పాటు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు ఎవరు నిల్వ ఉంచిన ఆహార పదార్దాలు తిన వద్దని సూచించారు. బోరు నీరు త్రాగే ప్రజలు కాచి చల్లార్చిన నీటిని త్రాగాలని చెప్పారు. కార్యక్రమంలో జాయింట్ డైరెక్టర్ డి మోహనకృష్ణా, డిప్యూటీ ఇంమ్యూనిసెషన్ అధికారి డాక్టర్ టి వెంకటేశ్వర్లు, డిపిఎంఓ డాక్టర్ రోహిణీరత్నశ్రీ, ఎపిడమిక్ సూపర్ వైజర్ పి ప్రభాకర్, డాక్టర్ రమణ, పిహెచ్‌సి ఎల్‌టి కరుణాకర్ పాల్గొన్నారు.

➡️