మోడీకి జతకకట్టిన పార్టీలను ఓడించండి : సిపిఎం జిల్లా కార్యదర్శి సిహెచ్‌ గంగయ్య

Apr 28,2024 01:27 ##BPTL #CPM #Gangaiah

ప్రజాశక్తి – బాపట్ల
నరేంద్ర మోడీ అడుగులకు మడుగులోత్తే టిడిపి, వైసిపిలను చిత్తుగా ఓడించి రాష్ట్రంలో ఇండియా వేదిక పార్టీలకు పట్టం కట్టాలని సిపిఎం జిల్లా కార్యదర్శి సిహెచ్ గంగయ్య కోరారు. మండలంలోని నందిరాజుతోటలో కాంగ్రెస్ ఎంఎల్‌ఎ అభ్యర్థి గంటా అంజిబాబు విజయాన్ని కోరుతూ శనివారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్రాల్లో మతకల్లోలాలు సృష్టించే మతతత్వ పార్టీలకు ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని అన్నారు. బాపట్ల ఎంఎల్‌ఎ అభ్యర్థి గంటా అంజిబాబు మాట్లాడుతూ వైసిపి పాలనలో అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన కోన రఘుపతిని ఓడించాలని అన్నారు. అన్ని రంగాలను నిర్వీర్యం చేసి యువతకు ఉపాధి దూరం చేసిన వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని ఓడిస్తేనే రాష్ట్రం బతికి బట్ట కడుతుందని అన్నారు. నరేంద్ర మోడీతో కొమ్మక్కైన రాజకీయ పార్టీలను రాష్ట్రం నుండి తరిమికొట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. కాంగ్రెస్‌కు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️