బైకును ఢీ కొట్టిన స్కూల్ బస్సు

Apr 6,2024 14:59 #Bapatla District

విజయనగర కాలనీలో సంఘటన

ప్రజాశక్తి-చీరాల : ద్విచక్ర వాహనాన్ని విద్యార్థులతో ప్రయాణిస్తున్న స్కూల్ బస్సు ఢీకొట్టిన సంఘటన మండలంలోని విజయనగర కాలనీ గ్రామంలో శనివారం మధ్యాహ్నం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఈపురిపాలెం గ్రామానికి చెందిన శ్రీ గీతాంజలి హై స్కూల్ బస్సు విద్యార్థులకు ఒంటి పూట బడులు కావడంతో విద్యార్థులను స్కూలు నుంచి ఇంటికి తీసుకు వెళుతున్న శ్రీ గీతాంజలి హై స్కూల్ బస్సు డ్రైవర్ మున్ను విజనగర కాలనీలో ఓ విద్యార్థిను దించి తిరిగి వెళుతున్నాడు. అయితే అదే గ్రామానికి చెందిన కె రిషిత్ అనే యువకుడు ప్రక్క రోడ్డులో నుండి ద్విచక్ర వాహనంపై మంచినీటి క్యానుతో వస్తున్నాడు. ఈ నేపథ్యంలో స్కూలు బస్సు ద్విచక్ర వాహనం రెండు ప్రమాదవశాత్తు ఢీకొన్నాయి. దీంతో ఆ యువకుడుకు కంటికి తీవ్ర గాయాలు అయ్యాయి. విషయం గమనించిన స్థానికులు వెంటనే యువకునికి ప్రథమ చికిత్స చేశారు. స్థానికులు వెంటనే డ్రైవర్ మున్నాను ను అడ్డుకున్నారు. సమాచారం అందుకున్న గీతాంజలి స్కూల్ యాజమాన్యం సంఘటన స్థలానికి చేరుకొని, కుటుంబం సభ్యులతో మాట్లాడారు. అయితే ప్రస్తుతం గాయపడిన రిషిత్ ను కుటుంబ సభ్యులు వెంటనే చికిత్స నిమిత్తం హాస్పిటల్ కు తరలించారు. అయితే డ్రైవర్ హారన్ కొట్టకుండా నిర్లక్ష్యంగా ఉండటంతోనే ప్రమాదానికి కారణమని స్థానికులు అంటున్నారు.

➡️