ప్రజాశక్తి – చీరాల
పట్టణంలోని ఉడ్ నగర్లో నూతనంగా నిర్మించిన పివి ప్రజ్ఞ హాస్పిటల్ను తాజా మాజీ శాసన సభ్యులు కరణం బలరామ కృష్ణమూర్తి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాణ్యమైన వైద్య సేవలను ప్రజలకు అందించి ప్రజల మన్నలు పొందాలని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, వైస్ చైర్మన్ బొనిగల జైసన్ బాబు, కట్టా చంద్ర, షేక్ సుభాని, వాసిమల్ల బ్రదర్స్ తదితర నాయకులు పాల్గొన్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/03/CRL-Prajna.jpeg)