ప్రజాశక్తి – వేమూరు
చిలకలూరిపేట నియోజకవర్గం బొప్పూడిలో జరిగే టిడిపి, జనసేన, బిజెపి ఉమ్మడి బహిరంగ సభ జయప్రదం చేయాలని వేమూరు టిడిపి అభ్యర్థి, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు కోరారు. స్థానిక టిడిపి కార్యాలయంలో శనివారం జరిగిన ఉమ్మడి సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. సభకు టిడిపి అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ప్రధాని మోడీ హాజరవుతారని తెలిపారు. మూడు పార్టీల కార్యకర్తలు హాజరు కావాలని కోరారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు జొన్నలగడ్డ విజయబాబు, మైనేని మురళీకృష్ణ, కనగాల మధుసూధన ప్రసాద్, జనసేన ఇన్ఛార్జి ఉసా రాజేష్ పాల్గొన్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/03/Battiprolu-1-Nakka.jpg)