పెసర్లంక విద్యార్థికి మండల ప్రథమం

Apr 23,2024 01:19 ##pesrlanka #school

ప్రజాశక్తి – భట్టిప్రోలు
పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో మండలంలోని ఐదు ప్రభుత్వ పాఠశాలలు, రెండు ఎయిడెడ్ పాఠశాలల్లో పెసర్లంక జెడ్‌పి ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించినట్లు ఎంఈఓ పులి లాజర్, నీలం దేవరాజులు తెలిపారు. మండలంలో 578మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 524 మంది 92.95శాతం ఉత్తీర్ణత సాధించినట్లు పేర్కొన్నారు. పెసరలంక జెడ్‌పి ఉన్నత పాఠశాల విద్యార్థి కె రాహుల్ 574మార్కులతో మండల ప్రథమ స్థానం పొందినట్లు తెలిపారు. జీ కీర్తన 569మార్కులతో ద్వితీయ స్థానం, టి స్టీఫెన్ పాల్ 567 మార్కులతో తృతీయ స్థానం సాధించి పాఠశాలకు ప్రత్యేక గుర్తింపు సాధించారని ఆనంద వ్యక్తం చేశారు. విద్యార్థులను అభినందించారు. మండల స్థాయిలో నిలిచిన విద్యార్థులను ఎంపీపీ డివి లలితకుమారి, జడ్పీటీసీ టీ ఉదయ్ భాస్కరి, ఎంపీటీసీ నన్నిపాముల చంటి దృశ్యాలవాలతో సత్కరించారు. కార్యక్రమంలో నాయకులు బాలాజీ, మల్లేశ్వరరావు పాల్గొన్నారు.

➡️