31న చంద్రబాబు ప్రజాగళం బహిరంగ సభ

Mar 30,2024 00:08 ##tdp #Bapatla #narendravarma

ప్రజాశక్తి – బాపట్ల
టిడిపి అధినేత చంద్రబాబు ఈనెల 31న నిర్వహించనున్న ప్రజాగళం బహిరంగ సభ విజయవంతం చేయాలని టిడిపి బాపట్ల పార్లమెంట్ అధ్యక్షులు ఎంఎల్‌ఎ ఏలూరి సాంబశివరావు కోరారు. నియోజకవర్గ విస్తృత సమావేశం వేగేసిన నరేంద్ర వర్మ అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు. సమావేశంలో పర్చూరు ఎంఎల్‌ఎ, బాపట్ల పార్లమెంటు టిడిపి అధ్యక్షులు ఏలూరి సాంబశివరావు మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో టిడిపి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బాపట్ల పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీలు, బాపట్ల పార్లమెంట్ స్థానాన్ని కైవసం చేసుకుంటామని అన్నారు. చంద్రబాబు ప్రకటించిన సూపర్‌ సిక్స్‌ పధకాలను ప్రజలకు వివరించాలని కోరారు. 18ఏళ్లు దాటిన మహిళలకు నెలకు రూ.15నగదు, ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు, యువగళం నిధి నుండి నిరుద్యోగ బృతి, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, తల్లికి వందనం పధకంతో ఇంట్లో ఎంత మంది పిల్లలు చదువుతుంటే అంతమందికీ ఒక్కొక్కరికి రూ.15వేలు వంటి పధకాలు పేదల అభివృద్దికి దోహదపడతాయని అన్నారు. తొలుత ప్రజాగళం బహిరంగ సభ స్థలాన్ని, చంద్రబాబు బసచేసే ప్రాంతాన్ని, ఏర్పాట్లను పరిశీలించారు.

➡️