టిడిపి కూటమి విజయంతోనే రాష్ట్రాభివృద్ధి

May 10,2024 00:07 ##tdp #Repalle #mla

ప్రజాశక్తి – రేపల్లె
రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే టీడీపీ, జనసేనా, బీజేపీ కూటమి వల్లే సాధ్యమని డాక్టర్ అనగాని కమల పేర్కొన్నారు. పట్టణంలోని 14, 15వ వార్డుల్లో ఇంటింటా ఎన్నికల ప్రచారం గురువారం నిర్వహించారు. ఆయా వార్డుల్లో ఆమెకు ఘన స్వాగతం ఫలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో పరిశ్రమలు, విద్య, వైద్య రంగాల్లో అభివృద్ధి చెందాలంటే టిడిపి విజయంతోనే సాధ్యమని అన్నారు. చంద్రబాబు సీఎం కావడంతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అన్నారు. టీడీపీ అధిక స్థానాలు గెలుచుకొని ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమన్నారు. గడిచిన ఐదేళ్ల వైసీపీ పాలనలో దోచుకోవడం, దాచుకోవడం తప్ప చేసిందేమీ లేదన్నారు. రానున్న ఎన్నికల్లో ఓటు ద్వారా వైసిపి తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేసి టిడిపి విజయానికి కృషి చేయాలని అన్నారు. మే13న జరిగే ఎన్నికల్లో ఎంఎల్‌ఎగా అనగాని సత్యప్రసాద్‌, బాపట్ల ఎంపిగా తెన్నేటి కృష్ణ ప్రసాద్‌ను గెలిపించాలని కోరారు.

➡️