ప్రజాశక్తి – సాలూరు : ఈనెల 13న సాధారణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ నిర్వహణపై అప్రమత్తంగా ఉండాలని ఆర్వో విష్ణు చరణ్ కోరారు. శనివారం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సెక్టార్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా చూడడంలో సెక్టార్ అధికారులదే కీలక పాత్ర అని చెప్పారు. అనంతరం ఇవిఎం పంపిణీకి ఏర్పాట్లను పరిశీలించారు. పంపిణీ సందర్భంగా ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని ఆర్వో విష్ణు చరణ్ సూచించారు.