‘ముత్తుముల’ ఆధ్వర్యంలో బైక్‌ ర్యాలీ

ప్రజాశక్తి-కొమరోలు: ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో ఆదివారం టిడిపి కార్యకర్తల కోరిక మేరకు రెండు దశాబ్దాల కాలంగా టిడిపి జెండాను మోసిన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేసేందుకు వారి కోరిక మేరకు తాటిచెర్ల మోటు నుంచి గోవిందపల్లి గ్రామం వరకు గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి టిడిపి పార్టీ నాయకులు, కార్యకర్తలతో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. కొమరోలు మండలంలో ఎమ్మెల్యేగా అశోక్‌రెడ్డి తొలి పర్యటనలో భాగంగా మండల పార్టీ అధ్యక్షులు బోనేని వెంకటేశ్వర్లు, అనప వీరశేఖర్‌, బిజ్జం వెంకటరామిరెడ్డి, ముత్తుముల సంజీవరెడ్డి పాల్గొన్నారు. అనంతరం అనప వీరశేఖర్‌ ఏర్పాటు చేసిన విందులో పాల్గొన్నారు. ముత్తుముల తొలిసారిగా మండలానికి వచ్చిన సందర్భంగా టిడిపి కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేశారు.

➡️