ప్రజాశక్తి-కశింకోట (అనకాపల్లి) : కశింకోట మండలం తాళ్లపాలెం ఏలేరు కాలువలో గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని బుధవారం పోలీసులు గుర్తించారు. ఏలేశ్వరం నుండి స్టీల్ ప్లాంట్ కు వెళుతున్న ఏలేరు కాలువలో మహిళ మృతదేహం కొట్టుకొనివచ్చింది. మహిళను ఎవరైనా గుర్తిస్తే సమాచారం అందజేయాలని పోలీసులు తెలిపారు. సిఐ వినోద్ బాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.