అత్యధిక మెజార్టీతో గెలుస్తా : బూచేపల్లి

ప్రజాశక్తి-దర్శి : సార్వత్రిక ఎన్నికల్లో తాను అత్యధిక మెజార్టీతో గెలుస్తానని వైసిపి దర్శి నియోజక వర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ బూచేపల్లి శివప్రసాద్‌ రెడ్డి తెలిపారు. స్థానిక వైసిపి కార్యాల యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో జగన్మోహన్‌రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందాయని తెలిపారు. మళ్లీ జగన్‌మోహన్‌రెడ్డే ముఖ్యమంత్రి అవుతారన్నారు. ప్రతి గ్రామంలో సచివాలయాలు, రైతు భరోసాలు, హెల్త్‌ క్లినిక్‌లు ఏర్పాటు చేసి ప్రభుత్వ పథకాలను వాలంటీరు వ్యవస్థ ద్వారా లబ్ధిదారులకు అందజేసినట్లు తెలిపారు. దర్శి నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి తాగునీరు అందేలా కృషి చేస్తామని తెలిపారు. వెలలిగొండ ప్రాజెక్టు రెండు టన్నెలు పూర్తి అయితే దొనకొండకు సాగునీరు, తాగునీరు వస్తాయన్నారు. తాళ్లూరు మండలంలో బూచేపల్లి సుబ్బారెడ్డి రిజర్వాయర్‌ పూర్తి చేసి ప్రజలందరికీ తాగునీరు, సాగునీరు అందిస్తామన్నారు. దర్శి నియోజకవర్గంలో ఎప్పుడూ ఎన్నికలు ప్రశాంతంగా జరుగు తాయన్నారు. ప్రస్తుతం నరసరావుపేట నుంచి వచ్చిన అభ్యర్థి 150 మందిని నియోజకవర్గంలో దించి ప్రజలను భయభ్రాంతులను గురిచేస్తున్నట్లు తెలిపారు. కడియాల రమేష్‌ అనే వ్యక్తిపై నాలుగు కేసులు, సెక్షన్‌ 307 ఉందన్నారు. ఇక్కడ ఎన్నికలు శాంతియుత వాతావరణంలో జరగాలంటే వారిని పోలీసులు ఇక్కడ నుంచి పంపించి వేయాలన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా తనను, ఒంగోలు ఎంపీగా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ, ముండ్లమూరు జెసిఎస్‌ కన్వీనర్‌ మేడికొండ జయంతి, వైసిపి మండల అధ్యక్షుడు వెన్నపూస వెంకటరెడ్డి, రాష్ట్ర కార్పొరేషన్‌ డైరెక్టర్‌ కుమ్మితంజిరెడ్డి, వైసిపి పట్టణ అధ్యక్షుడు కట్టికోట హరీష్‌, మాజీ ఎంపిపి ఇతర దేవదానం. వెంగల్‌రెడ్డి, సుబ్బారెడ్డి, వెంకటరెడ్డి పాల్గొన్నారు. గ్రామాల్లో ప్రచారం వైసిపితోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని వైసిపి దర్శి నియోజక అభ్యర్థి డాక్టర్‌ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి తెలిపారు. మండల పరిధిలోని అబ్బాయిపాలెం, ఉయ్యాలవాడ గ్రామాలలో పచారం నిర్వహించారు. ఈ సందర్భంగా శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ గ్రామాలలో మౌలిక సదుపాయాల కల్పనకు తనవంతు కషి చేస్తానన్నారు. అన్ని గ్రామాలు అభివద్ధి చెందాలంటే వైసీపీ మళ్లీ అధికారంలోకి రావాలన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా తనను, వైసిపి ఒంగోలు పార్లమెంట్‌ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ, వైసిపి మండల అధ్యక్షుడు వెన్నపూస వెంకటరెడ్డి, నాయకులు వీరారెడ్డి, వెంకటరెడ్డి, శ్రీనివాసరావు, మురళీమోహన్‌ పాల్గొన్నారు.

➡️