టిడిపి కూటమి అభ్యర్థిని గెలిపించాలంటూ … చల్లపల్లిలో ప్రచారం

Apr 30,2024 12:51 #Campaigning, #candidates, #Challapally, #TDP

ప్రజాశక్తి-చల్లపల్లి (కృష్ణా) : టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే పేద మహిళలను ఆర్ధికంగా శక్తివంతులను చేసే పథకాలు అమలులోకి వస్తాయని టీడీపీ, బీజేపీ బలపరిచిన జనసేన పార్టీ అవనిగడ్డ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్‌ కోడలు మండలి సాయి సుప్రియ తెలిపారు. టీడీపీ, బీజేపీ బలపరిచిన జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్‌, ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి ల గెలుపు కోరుతూ చల్లపల్లి పడమర వైపు ఎన్నికల ప్రచారం చేశారు. చల్లపల్లిలో రెండవ రోజు ప్రచారం ముమ్మరంగా సాగింది. టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పార్టీ జెండాలు చేతబూని ప్రచారంలో కదం తొక్కారు.

ఇంటింటికి వెళ్లి సూపర్‌ సిక్స్‌ పథకాలు వివరించారు. పేద మహిళలకు మహాశక్తి పథకం ద్వారా ఉచిత ఆర్టీసీ బస్‌ ప్రయాణం, ”ఆడబిడ్డ నిధి” పథకం ద్వారా 18 ఏళ్ళు నిండిన స్త్రీలకు ప్రతి నెల రూ.1,500లు, ”తల్లికి వందనం” పథకం ద్వారా మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే వారందరికీ రూ.15వేలు చొప్పున ఆర్ధిక సహాయం, ”దీపం” పథకం ద్వారా ఏడాదికి మూడు వంట గ్యాస్‌ సిలిండర్లు ఉచితం పథకాలు అమలులోకి వస్తాయన్నారు.

రైతు సోదరులకు ప్రతి ఏటా ”అన్నదాత” పథకం ద్వారా రూ.20వేలు పెట్టుబడి సహాయం, ”యువ గళం” పథకం ద్వారా నిరుద్యోగులకు 20లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగులకు రూ.3వేలు నిరుద్యోగ భఅతి అందిస్తారని వివరించారు. బీసీలకు రక్షణ చట్టం, ఇంటింటికి త్రాగునీటి కుళాయి ఇస్తామన్నారు. ”పూర్‌ టు రిచ్‌ ప్రోగ్రామ్‌” ద్వారా ఐదేళ్లలో పేదల ఆదాయం రెట్టింపు చేస్తామన్నారు.

ఈ అద్భుతమైన సంక్షేమ పథకాలను అప్పులు చేయకుండా సంపద సఅష్టించి అందించే అనుభవం కలిగిన సమర్థవంతుడైన నాయకులు నారా చంద్రబాబు నాయుడ, పవన్‌ కళ్యాణ్‌ ల నాయకత్వంలో నూతన ప్రభుత్వం ఏర్పాటుకు ప్రజలందరూ సంపూర్ణ మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

➡️