పాఠశాలను తనిఖీ చేస్తున్న విద్యాశాఖాధికారులు
పాఠశాలలో తనిఖీ
ప్రజాశక్తి – కందుకూరు : కందుకూరులోని ఒంగోలు ఆక్స్ ఫర్డ్ ప్రైవేటు పాఠశాలను కందుకూరు ఉప విద్యాశాఖ అధికారి ఎం వి వి ప్రసాదరావు, మండల విద్యాశాఖాధికాఇర కె సుబ్బారెడ్డి గురువారం సందర్శించారు. వారి రికార్డులను పరిశీలించారు. 12(1) సి కింద ఎంతమంది విద్యార్థులు చేరారో పరిశీలించారు.తొలి విడతగా 11 మంది రెండో విడతలో ఐదుగురు విద్యార్థులు చేరినట్లు యాజమాన్యం తెలియజేసింది. ప్రభుత్వ విధానాలను యాజమాన్యం తప్పకుండా ఆచరించాలని డివైఇఒ కోరారు. యుడైస్ ప్లస్ ప్రోగ్రెషన్ పెండింగ్ లేకుండా చూడవలెనని ఆదేశించారు.
![పాఠశాలలో తనిఖీ](https://prajasakti.com/wp-content/uploads/2024/06/300-33333-1.jpg)