లారీని ఢీకొన్న కారు – ఒకరి పరిస్థితి విషమం

Mar 28,2024 11:40 #Chittoor District

ప్రజాశక్తి-చిత్తూరు : జిల్లాలోని తవణంపల్లి మండలం కె.పట్నం 140 జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. కె.పట్నం వద్ద కారు లారీని ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది. కారులో ఉన్న ఒకే ఒక్క వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి.  ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉంది. కారు వేగాన్ని కంట్రోల్ చేయలేకపోవడంతో వెనుక నుంచి లారీని  ఢీకొనింది.  గాయపడిన వ్యక్తి బెంగళూరుకు చెందిన మహేష్ గా గుర్తించారు. తిరుపతి నుండి బెంగళూరుకు వెళ్తుండగా జరిగిన ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయపడిన మహేష్ ని రాణిపేట సీఎంసికి తరలించారు. కేసు నమోదు చేసిన తవణంపల్లి పోలీసులు దర్యాప్ చేస్తున్నారు.

➡️