డ్రైనేజీ పనులను పరిశీలించిన కమిషనర్ పి.ఆర్.మనోహర్

Nov 23,2023 14:30 #Annamayya district

ప్రజాశక్తి – బి.కొత్తకోట(అన్నమయ్య-జిల్లా) : తంబళ్లపల్లి నియోజకవర్గం,బి.కొత్తకోట నగర పంచాయతీలో డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కృషి చేస్తున్నట్లు కమిషనర్ పి.ఆర్.మనోహర్ పేర్కొన్నారు. గురువారం ఆయన ఏఈ రాజేంద్రతో కలిసి పట్టణంలోని దర్గావీధి రోడ్డు,ప్రాంతాల్లో నెలకొన్న డ్రైనేజీ సమస్యలను పరిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగర పంచాయతీ కమిషనరుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రధాన సమస్యల పరిష్కారంపై దృష్టి సారించి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూస్తున్నామన్నారు.ముఖ్యంగా మురుగునీటి కాలువల మరమ్మతులు,అసంపూర్తిగా మిగిలిపోయిన డ్రైనేజీలను నిర్మిస్తున్నామని తెలిపారు. పట్టణ ప్రజల ఆరోగ్యం,శ్రేయస్సుకు తొలి ప్రాధాన్యతమస్తున్నామన్నారు. ప్రజలకు ఏమైనా సమస్యలు ఉంటే నేరుగా నగర పంచాయతీ కార్యాలయాన్ని సంప్రదించవచ్చునన్నారు.అంతేకాకుండా బి.కొత్తకోట పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడానికి ప్రత్యేక కార్యాచరణ చేపడుతున్నామన్నారు.ఇందులో ప్రజలను సైతం భాగస్వాములు చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పిఏ మస్తాన్ పాల్గొన్నారు.

➡️