ప్రజాశక్తి -చోడవరం చోడవరం నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి జగతా శ్రీనివాసరావు శుక్రవారం చోడవరం పట్టణం, వడ్డాది జంక్షన్లో ప్రచారం చేపట్టారు. నర్సాపేట, గాంధీ గ్రామం, కొత్తూరు జంక్షన్, ఆర్ టి సి కాంప్లెక్స్, చిన్న బజార్ తదితరు చోట్ల ర్యాలీ నిర్వహించి హస్తం గుర్తుపై ఓటు వేయాలని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. దశాబ్ద కాలంగా కాంగ్రెస్ పార్టీ కనపడని చోడవరం నియోజకవర్గంలో శ్రీనివాస్ ప్రచారంతో ఆ పార్టీ అభిమానులు తప్పనిసరిగా ఓటు వేస్తామని హామీ ఇచ్చారు. శ్రీనివాస్ మాట్లాడుతూ తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే, ప్రత్యేక హౌదా ఇస్తామని, విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటుపరం కాకుండా చూస్తామని, సుగర్ ఫ్యాక్టరీ రైతులకు టన్నుకు రూ.4వేలు మద్దతు మద్దతు ధర ఇస్తామని చెప్పారు.
పచారం చేస్తున్న శ్రీనివాస్