ప్రజాశక్తి-అజిత్ సింగ్ నగర్ : 59 డివిజన్ పాతసింగనగర్లో సిపిఎం అభ్యర్థి చిగురుపాటి బాబురావు గెలుపు కోసం సిపిఎం నాయకులు ఆండ్ర మాలాద్రి ఆధ్వర్యంలో నాయకులు గురువారం ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆండ్రా మాలాద్రి మాట్లాడుతూ.. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం సిపిఎం అభ్యర్థి చిగురుపాటి బాబురావును భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రతి ఒక్కరు ఆలోచించి ఓటు వేయాలని సిపిఎంకు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. విజయవాడ అభివృద్ధి చెందాలంటే కమ్యూనిస్టులకు మద్దతు తెలపాలని ప్రజా సమస్యలు తీరాలంటే పిలిస్తే పలికే నాయకులు కావాలన్నారు. నిత్యం ప్రజా సమస్యలపై పోరాడే వ్యక్తినీ సింగ్ నగర్ వాంబే కాలనీ ప్రకాష్ నగర్ కండ్రిగ రాజీవ్ నగర్ ప్రాంతాలు అభివద్ధి చెందాలంటే చిగురుపాటి బాబురావుకి ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు నాగార్జున, సన్యాసిరావు, రూబేన్, పుల్లారావు వెంకటేశ్వరరావు, కమల కుమార్, ఆనంద్ కుమార్, దుర్గాభాగ్యమ బాబు, తదితరులు పాల్గొన్నారు.