ఏజెన్సీలో సిపిఎం విస్తృత ప్రచారం

May 10,2024 20:31

 ప్రజాశక్తి -గుమ్మలక్ష్మీపురం :  ఇండియా కూటమి మద్దతుతో కురుపాం నియోజకవర్గం సిపిఎం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న మండంగి రమణ గుమ్మలక్ష్మీపురం మండలంలో కొత్తగూడ, ఇరిడి, కుక్కిడి, డుమ్మంగి గ్రామాల్లో శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు గిరిజనులు ఘన స్వాగతం పలికారు. గిరిజన సమస్యలపై నిరంతరం పోరాడుతున్న ఒకే ఒక్క పార్టీ సిపిఎం అని అన్నారు. రానున్న ఎన్నికల్లో సుత్తీ, కొడవలి, నక్షత్రంపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు బిడ్డిక శంకరరావు, బిడ్డిక ఆడిత్తు ఉన్నారు.కొమరాడ : సిపిఎం అభ్యర్థులకు మద్దతుగా మండలంలోని గుమడ, గంగిరేగివలస, కురిమిపేట, కోనవలస, బొడ్డవలస ప్రచారం చేశారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న సిపిఎం తరుపున కురుపాం ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న మండంగి రమణను, అరకు పార్లమెంటు ఎంపిగా పోటీ చేస్తున్న పాచిపెంట అప్పల నరసను సుత్తీ, కొడవలి, నక్షత్రం గుర్తుపై ఓటేసి గెలిపించాలని కోరారు. ప్రచారంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గసభ్యులు వి.ఇందిర, నాయకులు సాంబమూర్తి, గోపాలర, నాగభూషణ్‌, సురేష్‌, రామారావు పాల్గొన్నారు.

➡️