డేవిడ్‌ మృతి పార్టీకి తీరనిలోటు

May 4,2024 15:37 #aalamuru

ప్రజాశక్తి – ఆలమూరు :ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన మాజీ ప్రధాన కార్యదర్శి, మండల సీనియర్‌ దళిత నాయకులు తాళ్ళ డేవిడ్‌ రాజ్‌ శుక్రవారం సాయంత్రం గుండెపోటుతో మరణించిన విషయం విదితమే. దీంతో డేవిడ్‌ స్వగఅహంలో ఆయన పార్ధివ దేహానికి శనివారం ఉదయం కొత్తపేట నియోజకవర్గ జనసేన ఇంఛార్జ్‌ బండారు శ్రీనివాసరావు పూలమాల వేసి నివాళులు అర్పించారు. బండారు వెంట మండల అధ్యక్షులు సూరపురెడ్డి సత్య, జిల్లా కార్యదర్శి ఆదినారాయణ, పల్లికొండ సుధీర్‌, చింతపల్లి సత్తిపండు, చల్లా బాబీ, చింతలపూడి శ్రీనివాసు, తదితర నాయకులు ఉన్నారు.కొత్తపేట నియోజకవర్గ వై.యస్‌.ఆర్‌.కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చిర్ల జగ్గిరెడ్డి, డేవిడ్‌ నివాసానికి వెళ్ళి ఆయన మఅతదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబసభ్యులతో మాట్లాడి వారికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.

➡️