ప్రజాశక్తి-పిచ్చాటూరు(తిరుపతి) : అరనియార్ ప్రాజెక్టులో పడి జింక మృతి చెందింది. సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పోస్టుమార్టం చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. నీటి కోసం వచ్చి ప్రమాదవశాత్తు ప్రాజెక్టులో చనిపోయి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/03/dearh.jpg)