ప్రజాశక్తి – ఎస్ఆర్ పురం (చిత్తూరు) : ఎస్ఆర్ పురం మండలంలోని కొత్తపల్లి గ్రామ పంచాయతీ 49 కొత్తపల్లిమిట్ట వాణిజ్య కూడలి వద్ద శనివారం రాష్ట్ర డిప్యూటీ సీఎం నారాయణస్వామి, ఆయన కూతురు కళాత్తూరు కృపా లక్ష్మి, స్థానిక సర్పంచ్ డివి డిల్లెయ్య విజయబాబు కోటిరెడ్డి బాబు ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక నాయకులతో కలిసి మండల స్థాయి నాయకులు కార్యకర్తలు మహిళలు భారీగా ఈ ప్రచారంలో పాల్గొన్నారు. కొత్తపల్లి గ్రామ పంచాయతీలోని గ్రామాలలో మండుటెండలను సైతం లెక్కచేయకుండా నాయకులు, కార్యకర్తలు, మహిళలు ఎన్నికల ప్రచారంలో దూసుకెళుతున్నారు.