ముమ్మరంగా ధర్మశ్రీ ఇంటింటా ప్రచారం

ధర్మశ్రీ ఇంటింటా ప్రచారం

ప్రజాశక్తి -చోడవరం : చోడవరం వైసీపీ అభ్యర్థి కరణం ధర్మశ్రీ చోడవరం పట్టణంలో శుక్రవారం పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. దొడ్డివీధి, పిల్లవారి తోట, ఎడ్ల వీధి, ఐటీ కాలనీ, చిన్నబజార్‌ తదితర చోట్ల ఇంటింటికి వెళ్లి, వైసిపి పాలనలో అమలు చేసిన పథకాలను వివరిస్తూ తమకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ప్రచారంలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని ధర్మశ్రీకి మద్దతు తెలిపారు. చోడవరం ఎమ్మెల్యేగా తనను, అనకాపల్లి ఎంపీగా బూడి ముత్యాలనాయుడుకు ఫ్యాన్‌ గుర్తుపై ఓటేసి గెలిపించాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులతో పాటు పలువురు వైసిపి కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే ధర్మ శ్రీ సోదరుడు రమణమూర్తి పట్టణంలో అనేక సంఘాలతో సమావేశం నిర్వహించి, తన సోదరునికి ఓటు వేసి గెలిపించాలని కోరారు.

ప్రచారం నిర్వహిస్తున్న ధర్మ శ్రీ

➡️