సమ్మె కాలపు ఒప్పందాలకు జీవోలు విడుదల చేయాలని.. మున్సిపల్‌ కార్మికుల ధర్నా

ఏలూరు : మున్సిపల్‌ సమ్మె కాలపు ఒప్పందాలకు జీవోలు విడుదల చేయాలని కోరుతూ … ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో ఏలూరు కలెక్టరేట్‌ వద్ద మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ … ఇంజినీరింగ్‌ విభాగం వర్కర్లకు స్కిల్డ్‌, సెమి స్కిల్డ్‌ జీతాలు ఇవ్వాలన్నారు. క్లాప్‌ ఆటోల డ్రైవర్లకు జిఒ ప్రకారం.. రూ.18,500 జీతాలు ఇవ్వాలన్నారు. మున్సిపల్‌ సమ్మె కాలపు ఒప్పందాలకు జిఒలు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

➡️