పారిశుధ్య కార్మికులకు మజ్జిగ ప్యాకెట్ల వితరణ

May 7,2024 15:38 #anatapuram

ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్‌ : 47 డిగ్రీలు ఎండ సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహిస్తున్న మున్సిపల్‌ కార్మికులకు రవికాంత్‌ రమణ.. మున్సిపల్‌ నగరపాలక సంస్థ కమిషనర్‌ మేఘ స్వరూప్‌ చేతుల మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్‌ కమిషనర్‌ మాట్లాడుతూ.. 47 డిగ్రీల ఎండ సైతం లెక్కచేయకుండా మున్సిపల్‌ కార్మికులు విధులు నిర్వహిస్తున్నారని వారికోసం మంచినీళ్లు ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు ఇప్పటికే పంపిణీ చేస్తున్నామని తెలిపారు అలాంటి సమయంలో మున్సిపల్‌ కార్మికుల కష్టాన్ని గుర్తించి ముందుకు వచ్చి 30 రోజులు ఒక్క రోజుకి 600 ల మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేస్తున్న రవి కాంత్‌ రమణను అభినందించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ కమిషనర్‌ హరిబాబు,నగరపాలక సంస్థ సెక్రెటరీ సంఘం శ్రీనివాసులు , డిప్యూటీ కమిషనర్‌ వెంకటేశ్వరరావు, ఎంహెచ్‌ఓ హెల్త్‌ ఆఫీసర్‌ విష్ణుమూర్తి, సెక్షన్‌ సూపరిండెంట్‌ దేవ శంకర్‌ అనంతపురం జిల్లా మున్సిపల్‌ ఉద్యోగ కార్మిక సంఘం సిఐటియు అనుబంధం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఏటీఎం నాగరాజు, కే నాగభూషణం, రెగ్యులర్‌ ఉద్యోగ కార్మిక సంఘం కార్యదర్శి నల్లప్ప, నగర అధ్యక్ష కార్యదర్శులు బండారి ఎర్రి స్వామి, సాకే తిరుమలేష్‌, ఇంజనీరింగ్‌ సెక్షన్‌ జిల్లా కార్యదర్శి రాయుడు, నగర అధ్యక్ష కార్యదర్శులు ఓబులపతి, మురళి, ఉపాధ్యక్షులు శశింద్ర కుమార్‌,కమిటీ సభ్యులు శ్రీనివాస్‌ మూర్తి, ప్రభాకర్‌, అక్కులప్ప, కుమార్‌, నల్లప్ప,తదితరులు పాల్గొన్నారు.

➡️