పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ

Feb 27,2024 16:41 #krishna, #Krishna district

ప్రజాశక్తి చల్లపల్లి(కృష్ణా) : ఇండియా విలేజ్‌ మినిస్ట్రీస్‌ పేదలకు ఎప్పుడూ అండగా ఉంటుందని ఆ సంస్థ డైరెక్టర్‌ వేములపల్లి సురేష్‌ అన్నారు. మంగళవారం చల్లపల్లిలో చిత్తుకాగితాలు ఏరుకొని జీవనం సాగిస్తున్న 70 మందికి, మండల పరిధిలోని పురిటి గడ్డ నడకుదురు యార్లగడ్డ గ్రామాలకు చెందిన 90 మంది వృద్ధులకు వికలాంగులకు లక్ష రూపాయలు విలువ గల నిత్యవసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సురేష్‌ బాబు మాట్లాడుతూ.. వికలాంగులకు, వృద్ధులకు సహాయ సహకారాలను అందిస్తుందని ఐవీఎం డైరెక్టర్‌ సురేష్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.

➡️