ప్రజాశక్తి-అన్నవరం (కాకినాడ) : అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారిని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ దర్శించుకున్నారు. బుధవారం ఎస్పీ సతీష్ కుమార్ కుటుంబ సమేతంగా కొండపైకి విచ్చేశారు ఈ సందర్భంగా దేవస్థానం అధికారులు వీరికి ఆలయ సాంప్రదాయాలు నిర్వహించారు. అనంతరం ఎస్పీ సత్య దేవుడిని దర్శించుకున్నారు. వేద ఆశీస్సులు నిర్వహించి స్వామివారి జ్ఞాపికను ప్రసాదాన్ని అందజేశారు. వీరి వెంట కిషోర్ పాల్గొన్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/06/satya-devudu.jpg)