వైద్యులు రమణ దంపతులకు డాక్టరేట్లు

ప్రజాశక్తి-రాజవొమ్మంగి : అల్లూరి సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగి మండలం జడ్డంగి గ్రామానికి చెందిన వైద్యులు బొల్లెం వెంకటరమణ, భార్య నాగలక్ష్మి డాక్టరెట్లను పొందారు. శనివారం హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో హౌలీ స్పిరిట్‌ క్రిస్టియన్‌ యూనివర్సిటీ అసోసియేషన్‌ అధినేత బిషప్‌ డా.ఆనంద్‌కుమార్‌ చేతులు మీదుగా ఇద్దరు డాక్టరెట్‌ను అందుకొన్నారు. ఈసందర్భంగా బొల్లెం వెంకటరమణ ఆదివారం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ.. ”నేను గిరిజనులకు అందించిన వైద్య సేవలు, స్వచ్ఛంద సేవలకు గాను డాక్టరెట్‌ను అందుకున్నట్లు తెలిపారు. భార్య నాగలక్ష్మి క్రిస్టియన్‌ ద్వారా దేవుని సేవలకు గుర్తించి తీయాలాజీ (నీతి శాస్త్రం)లో డాక్టరేట్‌ ఇచ్చారని తెలిపారు. ఈ సందర్భంగా రమణ దంపతులను పలువురు అభినందించారు.

➡️