సిపిఎం అభ్యర్థులను గెలిపించాలని ఇంటింటి ప్రచారం

ప్రజాశక్తి-విఆర్‌పురం : ఇండియా కూటమి బలపరిచిన రంపచోడవరం సిపిఎం అభ్యర్థి లోతా.రామారావు, ఎంపి అభ్యర్థి పి.అప్పలనర్సను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విఆర్‌పురం మండలంలో ములకనపల్లి పంచాయితీలో బంగారుగూడెం, ములకనపల్లి, రాజపేట పంచాయతీలోని తోటపల్లి, మొద్దులగూడెంలో సిపిఎం నాయకులు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి సోయం చిన్నబాబు మాట్లాడుతూ.. సిపిఎం అభ్యర్థులను అసెంబ్లీ పార్లమెంటుకు పంపిస్తే ఉపాధి హామీ పని దినాలను 200 రోజులకి, అలానే కూలీ రేట్లు 600 రూపాయలు చేసే విధంగా వారు పోరాడుతారని తెలిపారు. గిరిజనులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు వచ్చేలా కృషి చేస్తారని తెలిపారు. వైద్యం, పౌష్టికాహారం, రక్షిత మంచినీరు, రోడ్డు సౌకర్యాలు కల్పిస్తారని తెలిపారు. యవతకు ఉద్యోగాలు వచ్చేలా, పోలవరం నిర్వాసితులకు నష్టపరిహారం, పునరావాసం వచ్చేలా కృషి చేస్తారని తెలిపారు. ఈ ప్రచారంలో సర్పంచ్‌ సవల మారయ్య, శ్రీరామగిరి సర్పంచ్‌ పులి సంతోష్‌ కుమార్‌, నాయకులు బంగారు ప్రసాద్‌, సోడి మల్లయ్య, ప్రకాష్‌, కె.సత్యనారాయణ, సిపింఎ నాయకులు పాల్గొన్నారు.

➡️