ప్రజాశక్తి- బొబ్బిలి : మండలంలోని పోలవానివలస, ఐటిఐ కాలనీ, ఇందిరమ్మ కాలనీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి మరిపి విద్యాసాగర్ ఆదివారం ఇంటింటికీ వెళ్లి తనను గెలిపించాలని కోరారు. ఈయన వెంట కాంగ్రెస్ పార్టీ పిసిసి అధికార ప్రతినిధి మువ్వల శ్రీనివాసరావు, బొబ్బిలి మండల అధ్యక్షులు పత్రి రాజు, బాడంగి మండల అధ్యక్షులు రాజన్న అప్పలనాయుడు, రాంబద్రపురం మండల అధ్యక్షులు రాంబర్కి రామకృష్ణ, తెర్లాం మండల అధ్యక్షులు పొందూరు రవీంద్ర, కార్యకర్తలు ఈ శ్రీనివాస్, రాయి రామారావు, జగదీష్ తదితరులు పాల్గొన్నారు.