ప్రజాశక్తి-టీ నర్సాపురం : మండలంలో రెండో రోజు జనసేన ప్రచారం భాగంగా కూటమి అభ్యర్ధి చిర్రి బాలరాజు శ్రీ విశ్వేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకుని ప్రచారం మొదలు పెట్టారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి కారటం సాయి, జిల్లా కార్యదర్శి గడ్డమణుగు రవికుమార్, పోలవరం నియోజవర్గం జనసేన, తెలుగుదేశం, బిజెపి ఉమ్మడి అభ్యర్థి చిర్రి బాలరాజు, మండల అధ్యక్షులు అడపా నాగరాజు, మండల స్థానిక జనసైనికులు తెలుగుదేశం నాయకులు మరియు బిజెపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.