ప్రజాశక్తి- తాడేపల్లిగూడెం (పశ్చిమ గోదావరి) : తాడేపల్లిగూడెం టెలిఫోన్ ఎక్ఛేంజ్లో ఉన్న టెలిఫోన్ కోయిల్స్ కు సోమవారం ఉదయం నిప్పు అంటుకొని మంటలు చెలరేగాయి. స్పందించిన అగ్నిమాపక సిబ్బంది కార్బన్ డయాక్సైడ్ తో నిరోధించే ప్రయత్నం చేశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది నిమిషంలోపులోనే సంఘటన స్థలానికి చేరుకుని రెండు నిమిషాల్లో అగ్ని ప్రమాదాన్ని అదుపు చేశారు. టెలిఫోన్ ఎక్స్ఛేంజి చుట్టుపక్కల ఆసుపత్రులు, లాడ్జి, బ్యాంక్ లు ఉండడంతో ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. ఫైర్ సిబ్బంది సకాలంలో చేరుకుని మంటలను అదుపుచేయడంతో అందరూ ఊపిరి పీల్చుకుని ఫైర్ సిబ్బందిని అభినందించారు.