ప్రజాశక్తి -గోపాలపట్నం : జివిఎంసి 56వ వార్డు పరిధి పైడిమాంబ కాలనీలో పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు జోన్ 5 అధికారులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా పలు సమస్యలపై అక్కడి ప్రజలనడిగి తెలుసుకున్నారు. సమస్యలపై అధికారులతో మాట్లాడి పరిష్కార దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ పర్యటనలో 56వ వార్డు కార్పొరేటర్ రాజశేఖర్, తెలుగుదేశం పార్టీ శ్రేణులు అధికారులు పాల్గొన్నారు.
![MLA Ganababu Paryatana](https://prajasakti.com/wp-content/uploads/2024/06/1-Ganababu-3.jpg)