ప్రజాశక్తి-కడియం(తూర్పుగోదావరి) : మండలంలోని వేమగిరిలో బుధవారం రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా గ్రామ మాజీ ఉపసర్పంచ్, వైసీపీ నాయకుడు సూరపురెడ్డి జానకి రామయ్య టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. ఆయనకు గోరంట్ల పార్టీ కండువా వేసి ఆహ్వానించారు. అనంతరం గ్రామంలోని దేవి జనార్ధన నగర్,గొల్లల వీధి,పంచాయతీ వీధి, ముత్యాలమ్మ దిబ్బ,పల్లపు వీధులలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆయన కుమార్తె కంఠమనేని శిరీష సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తూఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిడిపి, జనసేన, బీజేపీ నాయకులు కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.