ప్రజాశక్తి-దర్శి : తనను ఆదరిస్తే నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివద్ధి చేస్తానని టిడిపి దర్శి నియోజక వర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ అన్నారు. దర్శిలో శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా పోలేరమ్మ గుడి వద్ద నుంచి గడియార స్తంభం సెంటర్ మీదుగా తెలుగుదేశం పార్టీ కార్యాలయం వరకూ సినీ నటుడు శివాజీ, మాజీ ఎమ్మెల్యే పాపారావుతో కలిసి రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా గడియార స్తంభం సెంటర్ లక్ష్మి మాట్లాడుతూ తమ తాత గొట్టిహనుమంతరావు, తన తండ్రి నరసయ్య, బాబారు రవికుమార్ ప్రజలకు సేవలు అందించినట్లు తెలిపారు. తాను దర్శి నియోజకవర్గంలో 97 పంచాయతీల పరిధిలోని 135 గ్రామాలు, దర్శి నగర పంచాయతీ పరిధిలోని 20 వార్డుల్లో పర్యటించినట్లు తెలిపారు. ఎక్కడికి వెళ్ళినా ప్రజలు, మహిళలు తననున ఆదర్శించినట్లు తెలిపారు. తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే దర్శిలోనే ఉండి వైద్యం చేసుకుంటూ ప్రజలకు వైద్యసేవలు అందిస్తానని తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే తనను, ఒంగోలు ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డికి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు శ్రీనివాసరావు, డాక్టర్ లలితసాగర్, టిడిపి, జనసేన, బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు