ప్రభుత్వం మొండి వైఖరి వీడాలి : సిఐటియు

 ప్రజాశక్తి – మార్టూరురూరల్‌ (బాపట్ల) : ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి అంగన్‌ వాడీల సమస్యలను పరిష్కరించాలని సిఐటియు బాపట్ల జిల్లా ఉపాధ్యక్షులు బత్తుల హనుమంతరావు డిమాండ్‌ చేశారు. 22 రోజు సమ్మెలో భాగంగా దున్నపోతుకు వినతి పత్రం అందజేసి నిరసన తెలిపారు. అనంతరం హనుమంతరావు మాట్లాడుతూ.. 22 రోజులుగా రోడ్లపై కూర్చుని నిరసన తెలుపుతున్న అంగన్‌ వాడీల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉంటోందని అయన మండిపడ్డారు. ప్రభుత్వాలు వస్తాయి..పోతాయి.. కానీ అంగన్వాడీ వ్యవస్థ అక్కడే ఉంటుందని ఈ విషయాన్ని ప్రభుత్వ పెద్దలు గుర్తు పెట్టుకోవాలన్నారు. అంగన్‌ వాడీల పోరాటానికి సిఐటియు అన్ని విధాలుగా అండగా ఉంటుందని స్పష్టం చేశారు. అనంతరం మార్టూరు సెక్టార్‌ యూనియన్‌ నాయకులు తాళ్లూరి రాణి, శ్యామల, శాంతి, రాజేశ్వరి, నాగ పుష్ప రాణి, కుసుమ తదితరులు పాల్గొన్నారు.

➡️