ప్రజాశక్తి -కరాస: జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ప్రధాన నౌకా పరిశోధన ప్రయోగశాల నేవల్ సైన్స్ అండ్ టెక్నలాజికల్ లేబొరేటరీ ఎన్ఎస్టిఎల్ మానసి ఆడిటోరియంలో జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పూణేలోని ఆర్మమెంట్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఎస్టాబ్టిష్మెంట్ మాజీ డైరెక్టర్ సురేంద్ర కుమార్, డిఆర్డిఒ నేవల్ సిస్టం అండ్ మెటీరియల్స్ డైరెక్టర్ జనరల్ వై.శ్రీనివాసరావు హాజరై మాట్లాడారు. విద్యార్థులు వినూత్న ఆలోచనలతో ప్రాథమిక పరిశోధనల నుంచి అనువర్తిత పరిశోధనల వైపు మళ్లాలని సూచించారు. కొత్త ఆలోచనలతో వర్థిల్లుతున్న భారతదేశం కొత్త టెక్నాలజీల యుగంలోకి మారుతోందని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదన్నారు. అనంతరం డిఆర్డిఒ ప్రయోగశాల వివిధ సాంకేతిక విజయాలను వివరించారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు, అధికారులు, పాల్గొన్నారు.