అగ్ని ప్రమాదంలో తాటాకు ఇల్లు దగ్ధం – నడిరోడ్డున పడిన కుటుంబం

May 10,2024 11:29 #aalamuru, #Fire Accident, #house burnt

ప్రజాశక్తి – ఆలమూరు (కోనసీమ) : మండలంలోని మడికి శివారు నాగులపేటలో శుక్రవారం ఉదయం జరిగిన అగ్ని ప్రమాదంలో తాటాకిల్లు దగ్ధమైనట్లు స్థానికులు తెలిపారు. వారి వివరాలు ప్రకారం… గొంపా మాలిబాబు, కొండమ్మ దంపతులు తమ ఇద్దరు పిల్లలతో తాటాకు ఇంటిలో నివాసం ఉంటుండగా ఈరోజు ఉదయం విద్యుత్‌ వైర్ల నుండి ఏర్పడిన మంటలతో ఇల్లు ఒక్కసారిగా అంటుకుని కాలిబూడిద అయినట్లు తెలిపారు. ఇంటిలో ఉన్న వంట సామాగ్రి, దుస్తులు, సైకిళ్లు, బైక్‌లతోపాటు అన్నీ కాలి బూడిద అవ్వడంతో సుమారు లక్ష రూపాయలు ఆస్తి నష్టం సంభవించినట్లు తెలిపారు. మంటలు పక్కనున్న ఇండ్లకు అంటుకోకుండా స్థానికులు కట్టడి చేయగలిగారు. కుటుంబ సభ్యులతో ప్రాణాలతో బయటపడిన ఆ కుటుంబం కట్టుబట్టలతో రోడ్డునపడింది. తక్షణమే అధికారులు స్పందించి బాధితులకు ప్రభుత్వ సాయాన్ని అందించి ఆదుకోవాలని స్థానికులు కోరారు.

➡️