ప్రజాశక్తి-సంతనూతలపాడు: మండలంలోని ఎనికపాడు గ్రామంలో వైసీపీ నుంచి నియోజకవర్గ టీడీపీ జనసేన బిజెపి ఉమ్మడి పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థి బిఎన్ విజరు కుమార్ సమక్షంలో సోమవారం టీడీపీలో చేరారు. గ్రామ మాజీ సర్పంచ్ బీవై ప్రసాద్ ఆధ్వర్యంలో 20 కుటుంబాల వారికి టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మద్దినేని హరిబాబు, బాపట్ల పార్లమెంట్ ఎస్సి సెల్ ప్రధాన కార్యదర్శి రంపతోటి అంకారావు, విక్రమ్ కోటయ్య, బి వెంకటేశ్వర్లు, రాఘవ గణేష్, చిన్న రాఘవ, వై శ్రీనివాసరావు, నారాయణ, కోతి కోటేశ్వరరావు, జి శ్రీను, నల్లూరు బుచ్చయ్య, మండల నాయకులు, గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.