మున్సిపల్ కార్మికులు
ప్రజాశక్తి – మైదుకూరు: సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలంటు, మున్సిపల్ కార్మికులు నిరవధిక సమ్మెను కొనసాగిస్తున్నారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయిస్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల సమస్యలపై జరుగుతున్న నిరవధిక సమ్మెలో భాగంగా బుధవారం మైదుకూరులో మున్సిపల్ కార్మికులు నిరవధిక సమ్మెలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపాలిటీ కార్మికులందరికీ వెంటనే పర్మినెంట్ చేయాలన్నారు. పెరిగిన నిత్యవసర ధరల మేరకు కార్మికులకు రూ.26వేలు జీతం ఇవ్వాలన్నారు. సిపిఎస్ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి ఓపిస్ పెన్షన్ అమలు చేయాలని, కోవిడ్ 19 కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. కార్మికులు చనిపోతే వారి కుటుంబాలకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. సిఐటియు ట్రెజర్ జి చిన్న, లక్ష్మయ్య శేఖర్ వెంకటసుబ్బయ్య పుల్లమ్మ విశ్వనాథం చిన్న రాముడు నాగయ్య పాపారాయుడు ఓబులమ్మ తదితరులు పాల్గొన్నారు.