ప్రచారంలో కాంగ్రెస్‌ దూకుడు

May 11,2024 22:42
కాంగ్రెస్‌ పార్టీ ప్రత్తిపాడు

ప్రజాశక్తి – ఏలేశ్వరం

కాంగ్రెస్‌ పార్టీ ప్రత్తిపాడు నియోజకవర్గ అభ్యర్థి నీరుకొండ సత్యనారాయణ ఎన్నికల ప్రచారంలో తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. శనివారం ఏలేశ్వరం, ప్రత్తిపాడు, శంఖవరం, రౌతులపూడి మండలాల్లో ఎన్నికల ప్రచారం ఇప్పటికే ప్రతీ గ్రామంలో ఇంటింటికి తిరిగి కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టోలో ఉన్న పథకాలను వివరిస్తూ కాకినాడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పల్లంరాజుకు, ప్రత్తిపాడు కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకి హస్తం గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని నీరుకొండ సత్యనారాయణ కోరారు. పాండవుల పాలెం, పొదురుపాక, బవురువాక మొదలగు గిరిజన గ్రామాల్లో మంగళవారం ఆయన పర్యటించగా తమ అభిమాన నేతకు గ్రామంలో అడుగడుగునా ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక హోదా, యువతకు ఉపాధి, రైతులకు రుణమాఫీలతోపాటు ఎన్నో పథకాలను అమలు చేసిన ఘనత ఒక కాంగ్రెస్‌ పార్టీదేనని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్‌సి సెల్‌ ఛైర్మెన్‌ మోయ్యేటి సూర్యప్రకాశరావు, కాకినాడ జిల్లా ఉపాధక్షలు కొప్పన కోటేశ్వరరావు, ప్రత్తిపాడు మండల అధ్యక్షులు మోయ్యేటి నారాయణ, కాంగ్రెస్‌ అధ్యక్షులు కరణం శ్రీనివాస్‌, తాతపూడి జార్జిరాజు, ఇతర నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

➡️