ఆర్మీ, నేవీ విద్యార్థులకు అవగాహనా సదస్సు

Mar 28,2024 16:43

విద్యార్థులతో మాట్లాడుతున్న అధికారులు

ప్రజాశక్తి-రామచంద్రపురం

ఎలక్షన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఆంధ్ర ప్రదేశ్‌ , జిల్లా ఎలక్షన్‌ అధికారి సూచనలతో గురువారం ఆర్మీ, నావీ విద్యార్థులకు అవగాహన సదస్సు, ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని విఎస్‌ ఎం కళాశాల ఆవరణలో ఆర్మీ , నేవీ విద్యార్థులతో ఎన్నికల అవగాహనా ర్యాలీ నిర్వహించినారు. ఈ సందర్భంగా తహశీల్దార్‌ ఎం.వెంకటేశ్వరరావు ఓటు యొక్క ఆవశ్యకతను ప్రజాస్వామ్యంలో ఓటర్ల ప్రాధాన్యతను వివరించారు. మునిసిపల్‌ కమిషనర్‌ శ్రీనివాసులు పాల్గొన్న ఈ సమావేశంలో సిఐ దొరరాజు, ఎస్‌ఐ సురేష్‌ బాబు, డిప్యూటీ తహశీల్దార్‌, రీ సర్వే డిప్యూటీ తహశీల్దార్‌ తదితరులు పాల్గొన్నారు.

 

➡️