పట్టణంలో బిసివై కార్యాలయంప్రారంభం

Mar 1,2024 16:42

పట్టణంలో ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించిన బిసివై  పార్టీ అభ్యర్థి బర్ల శ్రీనివాస్‌ యాదవ్‌

ప్రజాశక్తి-రామచంద్రపురం

పట్టణంలో భారత చైతన్య యువజన పార్టీ (బిసివైౖ) ఎన్నికల కార్యాలయాన్ని శుక్రవారం ప్రారంభించింది. పార్టీ అభ్యర్థి బర్ల శ్రీనివాస్‌ యాదవ్‌ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల సమయంలో నియోజకవర్గంలోని ప్రజలందరికీ తాను అందుబాటులో ఉండే విధంగా పట్టణం నడిబొడ్డులో తన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. తమ పార్టీ ఎన్నికల కార్యాలయాన్ని సందర్శించేందుకు పార్టీ కార్యకర్తలతో పాటు పురజనులు అందరూఆహ్వానితులేనని ఆయన అన్నారు. పట్టణవాసులు పార్టీ ఎన్నికల కార్యాలయానికి విచ్చేసి ఎల్లవేళలా ఎన్నికలకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవచ్చని బిసివై అభ్యర్థి శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. గత 40 రోజులుగా బీసీవై పార్టీ ప్రచార ఆటోలను ప్రతి దినం రామచంద్రపురం నియోజకవర్గంలోని వివిధ పల్లె ప్రాంతాలకు పంపించి ఎన్నికల ప్రచారం జరిపిస్తున్నట్లు శ్రీనివాస్‌ తెలియజేశారు. సాంప్రదాయ ప్రాంతీయ పార్టీలకు భిన్నంగా ముందుకు సాగుతున్న బీసీవై పార్టీ యువజన నాయకత్వానికి ఓటర్లంతా మద్దతు పలికి నిస్వార్ధమైన అభివద్ధితో కూడిన పాలన కోసం మన ఎన్నికల గుర్తైన ”చెరుకు రైతు” కు తమ అమూల్య మైన ఓట్లు వేసిగెలిపించవలసిందిగా ఈ సందర్భంగా శ్రీనివాస్‌ యాదవ్‌ నియోజకవర్గ ప్రజలను అభ్యర్థించారు.

 

➡️