ఇండియా కూటమి గెలుపునకు కృషి చేయాలి

Apr 4,2024 17:03
  • ఎపి రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి డేగ ప్రభాకర్‌

ప్రజాశక్తి-రామచంద్రపురం : రాజ్యాంగ రక్షణ కోసం నిరంతరం పోరాడుతున్న ఇండియా కూటమి అభ్యర్థులను గెలుపునకు కృషి చేయాలని ఎపి రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి డేగ ప్రభాకర్‌ పిలుపునిచ్చారు. ఎపి ప్రజానాట్యమండలి రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో రామచంద్రాపురంలో నిర్వహిస్తున్న ఎన్నికల పాటల వర్క్‌ షాప్‌ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సిపిఐ అభ్యర్థులు, ఇండియా కూటిమి అభ్యర్థుల గెలుపు కోసం ఎపి ప్రజానాట్యమండలి సాంస్కృతిక విభాగం ఎన్నికల్లో ప్రముఖ పాత్ర పోషించాలన్నారు. సాంస్కృతిక రంగం పాట, ఆట, లేకుండా ఏ ఉద్యమం విజయవంతం కాలేదన్న విషయాన్ని కళాకారులు గుర్తించాలన్నారు. ఆ దిశగా కళాకారులు తమ వంతు కర్తవ్యం గా ఈ ఎన్నికల రణరంగంలో ప్రజానాట్యమండలి ప్రముఖ పాత్ర పోషిస్తూ ఆటపాటలతో కొత్త కళారూపాలతో ప్రజల్ని మరింత చైతన్యవంతం దిశగా మరల్చి ఓట్లను రాబట్టడానికి అవసరమైన నూతన కళారూపాలను ప్రజల వద్దకు తీసుకెళ్లాలని సూచించారు. ప్రజానాట్యమండలి సీనియర్‌ నాయకులు డాక్టర్‌ స్టాలిన్‌ మాట్లాడుతూ పార్టీని ప్రజాసంఘాలను ప్రజా చైతన్యం వైపు మరల్చడానికి ప్రజానాట్యమండలి దోహద పడుతున్నదని అన్నారు. ప్రజానాట్యమండలి గళాన్ని వినిపిస్తూ దళాలుగా ఏర్పడి రాష్ట్రమంతా విస్తతంగా ప్రచార ప్రయత్నం చేస్తున్నందుకు కళాకారులందరికి అభినందనలు తెలిపారు. సాంస్కృతిక పోరాటాలు కూడా నిత్యం కొనసాగాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజానాట్యమండలి రాష్ట్ర సమితి ఈ ఎన్నికల పాటల శిక్షణా శిబిరం ఏర్పాటు చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. సమావేశంలో ఇఫ్టు జాతీయ కార్యదర్శి గని ఆంధ్రప్రదేశ్‌ ప్రజానాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిన్నం పెంచలయ్య, రాష్ట్ర అధ్యక్షులు పి చంద్ర నాయక్‌ సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి రాము, ఉమ్మడి గోదావరి జిల్లాల ఇన్చార్జి మహంత లక్ష్మణరావు, వి.నాగరాజు, శివయ్య, నజీర్‌ , కుమార్‌, శామ్యూల్‌, ప్రేమానందం, అనంతలక్ష్మి, ఉమా తదితరులు పాల్గొన్నారు.

కార్యక్రమంలో మాట్లాడుతున్న డేగా ప్రభాకర్‌

➡️