ఎన్నికల బాండ్ల వివరాలు ఇవ్వండి

Mar 11,2024 12:57 #Krishna district

సిపిఎం, సిపిఐలు డిమాండ్ 
ప్రజాశక్తి-గన్నవరం : తక్షణమే ఎన్నికల బాండ్లు వివరాలు సమాచారం అందజేయవలసినదిగా ఎన్నికల సంఘాన్ని వామపక్ష నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం గన్నవరం రాయ నగర్ లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్ వద్ద ఎన్నికల బాండ్ల వివరాలు వెంటనే అందజేయాలని కోరుతూ సిపిఎం, సిపిఐ కమిటీల ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్ రఘు మాట్లాడుతూ ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధమని, ఆ సమాచారం అందజేయాలని దేశ అత్యున్నత న్యాయవ్యవస్థ సుప్రీంకోర్టు ఆదేశించడం జరిగిందని అన్నారు. దేశంలో అత్యున్నతమైన, అతి పెద్ద డిజిటలైజేషన్ కలిగిన, దాదాపు 48 కోట్ల ఖాతాలు కలిగిన ప్రభుత్వ రంగ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కానీ మాకు జూన్ 30 వరకు గడువు కావాలంటూ దరఖాస్తు చేయటం ఎంత మాత్రం సమంజసం కాదని ఆయన అన్నారు. సిపిఐ నాయకులు పెద్దు వెంకటరత్నం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై ఎలాంటి విమర్శలు రాకుండా కాపాడేందుకు ఎస్బిఐ ఒక కవచంలా వ్యవహరిస్తుడం సరైనది కాదని అన్నారు. అతి పెద్ద డిజిటలైజేషన్ కలిగిన సంస్థ ఎస్బిఐ అని రాతపూర్వ కంగా భద్రపరిచేమని సాకు చూపించి గడువు కోరటం హాస్యాస్పదమని సిపిఐ జిల్లా నాయకులు పెద్దు వాసుదేవరావు అన్నారు. బాండ్లు ఇచ్చిన వారికి పుచ్చుకున్న వారికి మధ్య క్విడ్ ప్రోకో( నీకిది -నాకది) అనే బాగోతం నడిచిందని కొన్నిసార్లు కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవహరించటానికి ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చే విధంగా ఈ బాండ్ల ఉన్నాయని సుప్రీంకోర్టు తీర్పు కనుగుణంగా బాండ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు టీవీ లక్ష్మణ స్వామి, కే వెంకటేశ్వరరావు, మల్లంపల్లి ఆంజనేయులు, దాసే బాబురావు, ఏసుదాసు తాతబ్బాయి, ప్రజానాట్య మండల జిల్లా అధ్యక్షులు కొండల బాబు, సిపిఐ నాయకులు పెద్దు వాసుదేవరావు, కాట్రగడ్డ జోషి పాల్గొన్నారు.

➡️