ప్రజాశక్తి-చల్లపల్లి : మొవ్వ మండల పరిధిలోని చినముత్తేవికి చెందిన చీలి వీరాస్వామి నిడుమోలు(70) గూడూరు ప్రభుత్వ వైద్యశాలకు వైద్యం నిమిత్తం వెళుతూ ఉండగా నిడుమోలులో రోడ్డు దాటుతుండగా విజయవాడ నుండి మచిలీపట్నం వైపు వెళ్తున్న కారు బలంగా ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి ఇద్దరు కుమారులు ఒక కుమార్తె కలరు భార్య గతంలో మరణించారు. కూచిపూడి పోలీసులు కేసు నమోదు చేశారు.