మచిలీపట్నం : మచిలీపట్నం రూరల్ మండలం పరిధిలోని పోతెపల్లి గ్రామానికి చెందిన జనసైనికుడు గణేష్ (33) శనివారం తెల్లవారుజామను మచిలీపట్నం పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఈ విషయం తెలుసుకున్న ఎంపీ వల్లభనేని బాలశౌరి చలించిపోయారు. ప్రభుత్వాసుపత్రికి వెళ్లి భౌతికకాయాన్ని సందర్శించారు. మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. మృతుని పిల్లల పేరిట రూ.లక్ష డిపాజిట్ చేస్తానని ఆయన ప్రకటించారు. దీంతోపాటు ప్రభుత్వం నుంచి వచ్చే సాయం, ఇన్స్యూరెన్స్ అందేలా చూస్తానన్నారు. పిల్లల చదువుకు సంబంధించి సాయం చేస్తానని ఎంపీ బాలశౌరిగారు హామీ ఇఛ్చారు. గణేష్ భార్యకు ఉద్యోగం వచ్చేలా చూస్తానని ఎంపీ బాలశౌరి, జనసేన మచిలీపట్నం నియోజకవర్గ ఇంఛార్జి బండి రామకృష్ణ హామీ ఇచ్చారు. దీనితోపాటు నియోజకవర్గ జనసైనికులంతా కలిసి మరో రూ.50 వేలు ఆర్ధిక సాయం ఇస్తామని బండి రామకృష్ణ తెలిపారు.