ప్రతిభతోనే విజయానికి పీఠం 

Mar 30,2024 15:58 #Krishna district

ప్రజాశక్తి-గన్నవరం: స్థానిక విద్యానగర్లోని నారాయణ స్కూల్లో శనివారం కృష్ణా జిల్లాస్థాయి స్పెల్ బి పోటీలు నిర్వహించారు.సబ్ జూనియర్,సీనియర్ బాలబాలికలు ఈ పోటీల్లో పాల్గొన్నారు. నారాయణ స్కూలుకు చెందిన వర్షద్, రిషి, అఖిల,పవన్, మన్విత, వలి ప్రతిభ చాటి ప్రథమ స్థానంలో నిలిచారు. పాఠశాల ఏజీఎం అనిల్, ఆర్ ఐ సత్తిరెడ్డి, ప్రిన్సిపాల్ భాష, వైస్ ప్రిన్సిపాల్ జ్యోతి తదితరులు గెలుపొందిన యువకులకు సర్టిఫికెట్లు మెడల్స్ బహూకరించారు. పిల్లల్లో దాగివున్న సృజనాత్మక శక్తిని వెలికి తీయడానికి ఇటువంటి పోటీలు నిర్వహిస్తున్నట్లు అనిల్ తెలిపారు.

➡️