ప్రజాశక్తి-చల్లపల్లి : సచివాలయాల, మండల స్థాయిలో ఆడుదాం ఆంధ్ర క్రీడ పోటీలను నిర్వహించడంలో సహాయకారిగా విశేష కృషి చేసినందుకుగాను చల్లపల్లి-1 సచివాలయ మహిళా సంరక్షణ కార్యదర్శి వేమూరి లావణ్యను అధికారులు ఘనంగా బుధవారం సన్మానించారు. క్రీ పోటీల నిర్వహణలో ఆటగాళ్ళను ఎప్పటికప్పుడు కోఆర్డినేషన్ చేసుకోవడంలో, నిర్ణయించిన సమయానికి పోటీలు జరిగేలా చూడటంలో, క్రీడా ప్రాంగణంలో అవసరమైన సదుపాయాలు ఏర్పాటు చేయడంలో, పోటీ ఫలితాల రిపోర్టులను ఎప్పటికప్పుడు అధికారులకు అందించడంలో లావణ్య విశేష కృషి చేశారని అధికారులు ప్రశంసించారు. సన్మాన కార్యక్రమంలో చల్లపల్లి ఎంపీడీవో చేకు చినరాట్నాలు, ఇ.ఒ.పి.ఆర్.డి బి.అశోక్, చల్లపల్లి పంచాయతీ కార్యదర్శి పేర్ని మాధవేంద్రరావు, పురిటిగడ్డ, యార్లగడ్డ, మంగళాపురం పంచాయతీ కార్యదర్శిలు పి.రాంబాబు, హరీష్, సుబ్బారావులు, ఎంపీడీవో కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ శ్యామ్ సన్ బాబు, పిడిలు శ్రీలక్ష్మి, చోటి రాణి, నవీన్ కుమార్, పిఈటీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.